KTR | హైదరాబాద్లోని రామేశ్వరం కేఫ్లో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్ యాదవ్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్ యజమాని శరత్ ఘనస్వాగతం పలికారు.
భోజనం సందర్భంగా కేటీఆర్, అఖిలేశ్ యాదవ్ కేఫ్ రుచులను ఆస్వాదిస్తూనే రాజకీయ, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. అద్భుతమైన రుచులు అంటూ యజమాని శరత్ను అఖిలేశ్యాదవ్ అభినందించారు. భోజనం అనంతరం ఇరువురు నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు.