హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : దసరా సెలవుల అనంతరం రాష్ట్రంలోని విద్యాసంస్థలు గురువారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకొని స్కూళ్లకు ఈ నెల 13 నుంచి 25 వరకు, జూనియర్ కాలేజీలకు 19 నుంచి 25, పాలిటెక్నిక్ కాలేజీలకు 14 నుంచి 24 వరకు సెలవులు ప్రకటించారు.
పాలిటెక్నిక్ కాలేజీలు బుధవారం నుంచే ప్రారంభంకానుండగా, మిగతా విద్యాసంస్థలు గురువారం నుంచి తెరుచుకొంటాయి.