హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. 2020-21 విద్యా సంవత్సరం కంటే 2021-22లో అదనంగా 4,06,725 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడైస్ ప్లస్) నివేదిక వెల్లడించింది. దీంతో 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 33,03,699కి చేరింది. 1-12 తరగతుల వరకు వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందినట్టు నివేదిక వివరించింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు, పెద్ద సంఖ్యలో గురుకులాల ఏర్పాటు, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం వంటివి అడ్మిషన్లు పెరిగేందుకు దోహదం చేశాయి.
మరికొన్ని ముఖ్యాంశాలు