నల్లగొండ : టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం కట్టంగూర్ మండలం దుగినెళ్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వనం నాగయ్య, కాడింగు లింగ స్వామి, చిత్రం కృష్ణయ్య ఆధ్వర్యంలో 100 మంది, కట్టంగూర్ మండలం కేంద్రంలో కంకానాల శోభారాణి, తండు సాలమ్మ ఆధ్వర్యంలో 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ..నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
భవానీపూర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ
WhatsApp : భారత్లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఆదాయం పెంచుతూ ప్రజలకు పంచే ప్రభుత్వం మాది : మంత్రి జగదీష్రెడ్డి