వరంగల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని వర్ధన్నపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ ఎర్ర జానకి, వర్ధన్నపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర శ్రావణ్, ఉప్పరపల్లి గ్రామ ప్రధాన కార్యదర్శి సీనపెళ్లి యాకయ్య, బీజేపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండేటి మధు, రాజుతో పాటు 50 మందికి పైగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సమక్షంలో టీఅర్ఎస్ పార్టీలో చేరారు.
వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్లోనే ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఆంగోతు అరుణ, జడ్పిటిసి మార్గం బిక్షపతి, పిఎసిఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, మున్సిపల్ వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Kumrambhim Asifabad | అడా ఎస్బీఐ బ్యాంక్లో భారీ చోరీ
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
Mulugu | రోడ్ రోలర్ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ అరెస్ట్