యాదాద్రి భువనగిరి : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అనితారామచంద్రన్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. దాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు.
లోడింగ్ అన్ లోడింగ్ ఆన్ లోడింగ్ పక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్యేల వద్ద ధాన్యం దిగుమతులను వేగంగా చేపట్టాలన్నారు. అంతకుముందు బీబీనగర్ మండలంలోని గూడూరు గొల్లగూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
కమిషనర్ వెంట డీఆర్డీవో ఉపేందర్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపి కృష్ణ, పౌర సరఫరాల శాఖ ధికారి బ్రహ్మా రావు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పోలీసులమని బెదిరించి.. బంగారం దోచుకెళ్లిన దుండగులు
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయం