వరంగల్ : జిల్లాలోని సంగెం మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ రైతు నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ హనుమకొండ జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సంగెంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ అధికారులు రాజేంద్రనాథ్ను సంగెం తహసీల్దార్ కార్యాలయానికి తమ వెంట తీసుకొచ్చారు.
రాజేంద్రనాథ్తో పాటు ఇతర ఉద్యోగులను విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ హరికుమార్ ఆధ్వర్యంలో అధికారులు రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.