వినాయక్ నగర్, సెప్టెంబర్03 : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB)బుధవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగి తనను లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఓ బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం పై దాడి చేశారు. ఆర్ ఐ ( రెవెన్యూ ఇన్స్పెక్టర్) గా నిజామాబాద్ జోన్ 2, జోన్4 పరిధిలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ చారి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వద్ద నుండి రూ.7 వేలు లంచం తీసుకోవడంతో అప్పటికే అక్కడ మాట వేసి ఉన్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆర్ఐని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.
ప్రస్తుతం ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో ఇతర అధికారులు, ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈరోజు ఏసీబీకి పట్టుబడిన సదరు ఆర్ఐ శ్రీనివాసచారి గతంలో బోధన్ మున్సిపల్ లో విధులు నిర్వహించేవాడు. అక్కడ విధులు నిర్వహించే సమయంలో సైతం సదరు ఉద్యోగి అక్కడ సైతం ఏసీబీకి పట్టుబడినట్లు సహా ఉద్యోగుల ద్వారా తెలిసింది.