మహేశ్వరం, సెప్టెంబర్ 21: లంచాలకు అలవాటుపడిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ కానిస్టేబుల్ యాదయ్య అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) వలలో చిక్కాడు. ఓ కేసులో లంచం స్వీకరించబోతున్న ఆయనను మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ భూవివాదంలో పోరండ్ల గ్రామానికి చెందిన దయాల బాల్రాజ్ మరో ఐదుగురు వ్యక్తులపై ఏడాది క్రితం మహేశ్వరం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేసేందుకు యాదయ్య మూడు రోజుల క్రితం డబ్బులు డిమాండ్ చేశాడు. తనకు రూ.5 వేలు, ఎస్సై శ్రీనివాస్రెడ్డికి రూ.20 వేలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారులకు పక్కా సమాచారం అందడంతో మంగళవారం యాదయ్యను వలపన్ని పట్టుకున్నారు. ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని, ఎస్సై శ్రీనివాస్రెడ్డిపై విచారణ కొనసాగిస్తున్నామని డీఎస్పీ సూర్యనారాయం వివరించారు.