ఒకప్పుడు సాగునీళ్లు లేక రైతులు అల్లాడిపోయే వారు. ఎండాకాలంలో పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు అందకపోతే ట్యాంకర్తో తెచ్చి పోసేవారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్తో సాగునీటి లభ్యత సమృద్ధిగా పెరిగి గ్రామాల్లోని చెరువులన్నీ నిండుకుండలా మారాయి. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో భూమికి సమాంతరంగా నీరుపైకి వచ్చి చూపరులను కనువిందుచేస్తున్నది.