జనగామ : రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయి పెన్షన్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఇది సీఎం కేసీఆర్ మాట తప్పని పనితీరుకు, మడమ తిప్పని నిజాయితీకి ఒక ఉదాహరణ మాత్రమేనని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి కొత్త ఆసరా పెన్షన్ దారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చే నాటికి 20 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్యను తెలంగాణ వచ్చాక 40 లక్షలకు పెంచామని మంత్రి తెలిపారు.
తాజాగా 65 సంవత్సరాల వయసు నుండి 57 సంవత్సరాలకు కుదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా మరో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు మంత్రి వివరించారు. ఈ మొత్తం సంఖ్య యాభై లక్షల దరిదాపులకు చేరిందనిఆయన పేర్కొన్నారు. అన్నారు.
కేంద్రం 200 కోట్లు మాత్రమే ఇస్తూ ఆరు లక్షల మందికి పెన్షన్లు అందజేస్తుందని, అదే తెలంగాణ ప్రభుత్వం 50 లక్షల మందికి ఏడాదికి 1200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు.
ఇచ్చిన్న మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని, మ్యానిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పథకాలను కాపీ కొట్టి బిజెపి పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నదని మంత్రి ఎద్దేవా చేశారు. అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, కొత్త పెన్షన్ లబ్ధి దారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.