సదాశివనగర్, డిసెంబర్ 14 : కామారెడ్డి జిల్లా( Kamareddy district) సదాశివనగర్ మండలంలోని భూపంల్లి శివారులో ఓ యువతి దారుణ హత్య(Brutally murdered)కు గురైంది. సదాశివనగర్ సీఐ రామన్, ఎస్సై రాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 16 నుంచి 20 ఏండ్ల వయస్సు గల యువతి హత్యకు గురైంది. యువతిని ఇక్కడే చంపారా? లేదా ఇతర ప్రాంతంతో చంపి ఇక్కడి తీసుకొచ్చి దహనం చేశారా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాళ్లు, చేతులు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు.