శాయంపేట, మే 11: ఓ యువకుడు అనాథను పెండ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచా డు. కరీంనగర్ జిల్లా మెతుకుపల్లికి చెందిన కర్నకంటి రమ్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో హనుమకొండలోని ప్రభుత్వ బాలికా సదనంలో పెరిగి అక్కడే చదువుకున్నది. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన అనబత్తుల వినయ్ మండల పరిషత్లో ఔట్సోర్సింగ్లో టైపిస్ట్గా పనిచేస్తున్నాడు.
అనాథ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలని భావించిన వినయ్ ఐదు నెలల క్రితం జిల్లా సంక్షే మ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు వినయ్కి, రమ్యతో పెండ్లి నిశ్చయించారు. రమ్య తరఫున ఐసీడీఎస్ అధికారులే పెండ్లి పెద్దలుగా వ్యవహరించి గురువారం పత్తిపాకలోని గౌడ కమ్యూనిటీ హాలులో పెండ్లి జరిపించారు.