వనపర్తి టౌన్, జ నవరి 14: అమెరికా లో వనపర్తికి చెందిన యువకుడు మరణించారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన గ ట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్(22) బీటెక్ పూర్తి చేసి.. ఎం ఎస్ చదివేందుకు గత డిసెంబర్ 28న అమెరికా వెళ్లారు. శనివారం రాత్రి భోజ నం చేసి గదిలో పడుకున్న విద్యార్థి నిద్రలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటిప ర్యంతమయ్యారు. బాధిత కుటుంబ స భ్యులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరామర్శించారు. భౌతికకా యం త్వరగా తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మా ట్లాడుతానని సింగిరెడ్డి భరోసా ఇచ్చారు.