ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ కొనివ్వలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడడ్డాడు. ఈ విషాదకర సంఘటన వాజేడు మండలం చంద్రుపట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గట్టి లలిత, స్వామి దంపతుల కుమారుడు గట్టి నితిన్ (19) బైక్ కొనివ్వలేదని తొమ్మిది రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గమనించిన తల్లిదండ్రులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం అందిస్తుండగానే సోమవారం రాత్రి 10 గంటలకు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నితిన్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.