యాదగిరిగుట్ట ;యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు రూ.3 కోట్ల విలువ చేసే భవనాన్ని విరాళంగా అందజేశారు. చైతన్యపురికి చెందిన టీ శారద, హనుమంతరావు దంపతులు 260 గజాల్లో నిర్మించిన రెండంతస్థుల భవనాన్ని దేవస్థానం పేరిట సోమవారం సరూర్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్, దాతలు శారద, హనుమంతరావు దంపతులకు ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో దోర్భల భాస్కర్శర్మ, ఏఈవో గట్టు శ్రవణ్కుమార్, ఆలయ అధికారులు సత్యనారాయణశర్మ, ప్రసాద్ పాల్గొన్నారు. – యాదగిరిగుట్ట