హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పశుగ్రాసం కోసం అడవులపై పెంపుడు జంతువుల ఒత్తిడిని తగ్గించేందుకు అటవీ సమీప గ్రామాల్లో పల్లె పశువుల వనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ సూచించారు. ప్రయోగాత్మకంగా అన్ని జిల్లాల్లో ఈ తరహా పల్లె వనాలను వెంటనే అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అటవీ సంరక్షణ, నిర్వహణపై హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో రెండురోజుల రాష్ట్రస్థాయి వర్షాప్ శుక్రవారం ముగిసింది.
హరితహారం, అర్బన్ ఫారెస్ట్ పారుల నిర్వహణ, అటవీ సంరక్షణ చట్టం, అభివృద్ధి పనులకు అటవీ భూముల మళ్లింపు, అటవీ రక్షణ-విజిలెన్స్, కంపా, ఎకో టూరిజం తదితర అంశాలపై చర్చించారు. విద్యార్థులు, పర్యావరణ ఔత్సాహికులతో నేచర్ క్లబ్లు ఏర్పాటు చేసి వనదర్శిని కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎకో టూరిజం అభివృద్ధికి తగిన ప్రదేశాలను ఎంపిక చేయాలని చెప్పారు. సదస్సులో పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) సువర్ణ, పీసీసీఎఫ్ (ఎఫ్సీఏ) ఎంసీ పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్లు వినయ్కుమార్, సునీతా భగవత్ హాజరయ్యారు.