హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు నిమిషాలకు వెయ్యి జననాలు నమోదు అవుతున్నాయి. అత్యధిక జననాలు నమోదయ్యే దేశాల్లో భారత్ (172) తొలి స్థానంలో, చైనా (103) రెండోస్థానంలో ఉన్నాయి.
ప్రతి నాలుగు నిమిషాలకు ఆసియాలో 517, ఆఫ్రికాలో 326, అమెరికన్ దేశాల్లో 106, యూరోప్లో 52 మంది జన్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా, జననాల రేటు ఆధారంగా సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్బుక్ ఈ గణాంకాలను విడుదల చేసింది.
దేశంలో ప్రతి రెండు నిమిషాలకు సగటున 100 మంది పుడుతున్నారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ప్రతి రెండు నిమిషాలకు 50 మంది జన్మిస్తున్నారు. అంటే మొత్తం జననాల్లో సగం వాటా ఈ రాష్ర్టాల్లోనే ఉన్నది.
మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ, ఆంధప్రదేశ్లో 3 చొప్పున జననాలు నమోదు అవుతున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 7-8 నిమిషాలకు ఒక జననం, ఈశాన్య రాష్ర్టాల్లో 5 నిమిషాలకు ఒక జననం నమోదవుతున్నది.