హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందు కు అభ్యర్థులు సిద్ధం చేసిన వివిధ రకాల వస్తువులు భారీ స్థాయిలో పట్టుబడ్డా యి. వాటి విలువ రూ.13 కోట్ల పైమాటే. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వ్యవస్థాపకుడు పల్నాటి రాజేంద్ర ఆర్టీఐ చట్టం ద్వారా ఎస్ఈసీ నుంచి ఈ వివరాలు సేకరించి, శనివారం మీడియాకు విడుదల చే శారు.
జీపీ ఎన్నికల్లో రూ.2,48,08,4 40 నగదుతోపాటు రూ.7,35,14,683 బంగారం, మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డాయి. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్నికల్లో రూ.1,56,29,170 నగదు, రూ.1,99,46,440 బంగారం, మద్యం, డ్రగ్స్ ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 2,547 కేసులు నమోదు చేశారు.
