హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మైనార్టీల ఆలోచనలో మార్పు వచ్చిందా? కాంగ్రెస్ నుంచి ఆ వర్గం తిరిగి బీఆర్ఎస్కు షిఫ్ట్ అవుతున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నా యి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు కలిగిన మేలును, ఐదు నెలలుగా కాం గ్రెస్ ప్రభుత్వం వేసిన అడుగులతో బేరీజు వేసుకుంటున్న ఆ వర్గం తిరిగి బీఆర్ఎస్ వైపు మళ్లుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయని సామాజిక విశ్లేషకులు చెప్తున్నారు. కేసీఆర్ రోడ్షోలకు మైనార్టీలు భారీ ఎత్తున హాజరుకావడాన్ని ఉదహరిస్తున్నారు. రోజురోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతున్నదని, అందులో మైనార్టీ షేర్ ఇమిడి ఉన్నదని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వైపు మళ్లిన మైనార్టీ వర్గాలు ఐదు నెలల్లోనే అభిప్రాయాన్ని మార్చుకుంటారని అనుకోలేము. కానీ, గతంలో బీఆర్ఎస్ మైనార్టీ వ ర్గాలకు ఇచ్చిన భరోసా కాంగ్రెస్ హయాంలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో మైనార్టీలకు అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత చేతులెత్తేసిందనే ఆరోపణలు మూటగట్టుకున్నది. మైనార్టీల్లో ఢిల్లీ దా కా పరిచయాలున్న షబ్బీర్అలీ లాంటి నాయకుడిని అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతానికి పం పి ఓడగొట్టడమే కాకుండా ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగానే శాసనసభలో తమ వర్గాన్ని లేకుం డా చేసిందని ముస్లింలు ఆగ్రహంతో ఉన్నా రు. రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేస్తున్న వ్యా ఖ్యలపై ఆ పార్టీలో ఎవరూ స్పందించకపోవడం వంటి పరిణామాలతో మైనార్టీ వర్గాలు పునరాలోచనలో పడ్డాయని చెప్తున్నారు. అర్వింద్ వ్యాఖ్యలకు స్పందించకపోవడమే కాకుండా, అమిత్షా సైతం రేవంత్రెడ్డి వ్యా ఖ్యలను తిప్పికొట్టకపోవడం వంటి పరిణామా లు ఆ వర్గాన్ని అయోమయానికి గురిచేస్తున్నాయని విశ్లేషకులు ఉదహరిస్తున్నారు.
కేసీఆర్ రోడ్షోలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు నిర్వహిస్తున్న సమావేశాలు, రోడ్షోల్లో మైనార్టీల భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నది. కేసీఆర్ మైనార్టీ వర్గాలను ఆకట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుచేస్తున్నారు. రంజాన్ సందర్భంగా తమ సర్కార్ అందించిన తోఫా ఈసారి ఎందుకు రాలేదని కేసీఆర్ వేస్తున్న ప్రశ్నకు ఈ వర్గం నుంచి స్పందన వస్తున్నదని, ఇది ఆ వర్గం ఆలోచన లో మార్పునకు సంకేతమని చెప్తున్నారు. ప దేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం మైనార్టీ సంక్షేమాన్ని పట్టించుకోకపోవడమే కాకుండా కలిసి ఉన్న ప్రజల మధ్య చి చ్చుపెడుతున్నదని కేసీఆర్ వివరిస్తున్న తీరుతో ఆ వర్గం పునరాలోచనలో పడేందుకు దోహ దం చేసిందని పరిశీలకులు వివరిస్తున్నారు.