హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఉద్యమ స్ఫూర్తితో రోడ్డు రవాణా సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. సచివాలయంలోని మంత్రి చాంబర్లో గురువారం ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నూతన బస్సుల రవాణా వెసులుబాటు, రావాల్సిన నూతన బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, సంస్థకు వచ్చిన లాభాలు, వ్యయం, సంస్థలో చేపట్టిన పలు కార్యాచరణలు, బస్సుల ఓఆర్, ఉద్యోగుల సంక్షేమం, అందిస్తున్న వైద్య సేవలు తదితర అంశాలపై ఎండీ సజ్జనార్ మంత్రికి వివరించారు. సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి కే శ్రీనివాసరాజు, రవాణాశాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, సంయుక్త రవాణా కమిషనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.