జోగులాంబ గద్వాల : ఆర్టీసీ బస్సులో(Rtc bus) ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గువ్వల దిన్నె గ్రామానికి చెందిన పావని అనే మహిళ(Pregnant woman) తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్ వెళ్లడానికి గద్వాల ఆర్టీసీ బస్సు ఎక్కింది. నందిన్నె గ్రామ సమీపంలోకి రాగానే నొప్పులు ఎక్కువడంతో బస్సులోనే ప్రసవించింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆర్టీసీ డ్రైవర్ జీఎన్ గౌడ్ తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కు తరలించారు. మహిళ ప్రసవానికి సహకరించిన తోటి ప్రయాణికులను పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Cold Wave | తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
KTR | ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు