మహబూబాబాద్ : మహబూబాబాద్(Mahbubabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదనాన్న దశదిన ఖర్మకు వెళ్లి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కేసముద్రం మండలం పెనుగొండ (Penugonda) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నలమాస ప్రకాష్ అనే వ్యక్తి తన పెదనాన్న దశ దిన కర్మ సందర్బంగా స్నానం చేసేందుకు బావిలో(Well) దూకాడు.
అయితే బావిలోని పూడిక మట్టిలో తల ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రకాష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.