న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కేంద్ర సమాచా ర కమిషన్ (సీఐసీ)లో అత్యధిక సం ఖ్యలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుండటాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎందు కు నియామకాలు చేపట్టలేదో తెలుసుకోవాలంటూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ను ఆదేశించింది. సీఐసీలో మొత్తం 160 ఉద్యోగ ఖాళీలు ఏర్పడగా, వీటిలో 100 పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో ఔట్సోర్సింగ్ సిబ్బందితో భర్తీ చేయటాన్ని కమిటీ ప్రశ్నించింది.
సరైన అభ్యర్థులు దొరక్క ఔట్సోర్సింగ్ ద్వా రా నియమించాల్సి వచ్చిందని సీఐసీ వివరణ ఇచ్చింది. రెగ్యులర్ ఉద్యోగుల స్థానాన్ని శాశ్వతంగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో భర్తీచేస్తానంటే కుదరదని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పేర్కొంది. కేంద్ర సంస్థలోని అధికారులందరూ తమ త్రైమాసిక రిటర్న్స్ సీఐసీకి సమర్పించాలని, చట్టబద్ధమైన నిబంధనలు పాటించేలా అన్ని శాఖల విభాగాలు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది.