కరీంనగర్ : కరీంనగర్ సమీపంలోని అల్గునూర్కు చెందిన రేషవేణి లచ్చయ్య (60) అనే వ్యక్తి సోమవారం ఉదయం మానేరు వంతెన పైనుంచి పడి మృతి చెందాడు. లచ్చయ్య ప్రమాద వశాత్తు పడ్డాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. స్థానికులు మాత్రం గత కొద్ది రోజులుగా లచ్చయ్య కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, కుటుంబ కలహాలతోనే ఆయన మానేరు వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.