రాజన్న సిరిసిల్ల : బైక్(bike)ను కారు ఢీ కొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వీర్నపల్లి మండలం బావుసింగ్ నాయక్ తండాకు చెందిన భూక్య సంతోష్ (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సంతోష్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.