రంగారెడ్డి : గుర్తు తెలియని వాహనం(Unknown vehicle) ఢీ కొని ఓ యువకుడు దుర్మరణం(Died) పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్(Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్ మోహియుద్దీన్(24) అనే వ్యక్తి ఆరాంఘర్ నుంచి మోహిదీపట్నం వైపు బైక్ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఉదయం మంచు కారణంగా వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీ కొట్టడంతో అక్బర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.