నిర్మల్ : నిర్మల్(Nirmal) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైక్(Bike)పై వెళ్తున్న ఇద్దరిపై గుర్తు తెలియని దుండగులు గొడ్డలి(Axe)తో దాడి చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి(Man died) చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాకదర సంఘటన నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ జంగల్ హనుమాన్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఈ దాడిలో బుచ్చన్న(55) అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.