ములుగు : జిల్లాలో ఘో ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం అబ్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
అబ్బాపూర్ గ్రామానికి చెందిన ఆరేందుల మొగిలి (50) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. లారీ అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మొగిలి మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.