పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapally) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా వివాహమాడిన భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు. చేసిన బాసలు మరిచి కట్టుకున్న భార్యను కిరాతకంగా(Brutal murder) హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని పెద్దపల్లి మండలం రంగాపూర్లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కలబోయిన కొమురయ్య, కౌసల్య(45) దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అయితే కొమురయ్య మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో తరచూ భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొమురయ్య కౌసల్యను మారణాయుధాలతో నరికి చంపి పరారయ్యాడు. వేరే మహిళతో అక్రమ సంబంధం ఉన్నందు వల్లే కౌసల్యను హతమార్చాడని బంధువులు ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.