మహబూబాబాద్ : అనుమానం ఆమె పాలిట పెనుభూతమైంది. జీవితాంతం కలిసి ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే..భాస్కర్, కల్పన(25) భార్యభర్తలు.
మహబూబాబాద్లోని అడ్వకేట్ కాలనీలో నివాసముంటున్నారు. కాగా, భాస్కర్ మటన్ షాప్లో పనిచేస్తుండగా.. అతడి భార్య పలు ఇండ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్ కల్పనను కత్తితో గొంతు కోసి హతమార్చాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.