నిజాంసాగర్, ఆగస్టు 9 : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు గూల రాములు రోజు మాదిరిగానే బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేట కోసం వెళ్లాడు. చేపల వేట కొనసాగిస్తుండగా 25 కిలోల చేప వలకు చిక్కింది. నిజాంసాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండి ఉండడంతో మత్స్యకారులకు పుష్కలంగా చేపలు లభ్యమవుతున్నాయంటూ కార్మికులు సంబురపడుతున్నారు.