ములుగు : జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. గురువారం వెంకటాపురం మండలం కొండాపూర్ – ఆలుబాక గ్రామాల మధ్య మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖలు రాశారు. మావోయిస్టు ఇన్ఫార్మర్లను హెచ్చరిస్తూ పోస్టర్లు వెలిశాయి.
బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లు ప్రకటిస్తూ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మావోయిస్టులు పోస్టర్లలో పేర్కొన్నారు. మావోయిస్టు పోస్టర్ల నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి..
Jai Bhim: తగ్గని జై భీమ్ హవా.. టాప్లో నిలిచిన సూర్య లేటెస్ట్ చిత్రం
Brutally murdered | పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Singareni | బొగ్గు గనుల అమ్మకాలపై భగ్గుమన్న సింగరేణి కార్మికులు