రాజన్నసిరిసిల్ల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): సాంచాలలో నెలకొన్న సంక్షోభాన్ని తొ లగించాలని, తమకు చేతినిండా పనికల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ‘నేతన్నల ఆకలి కేక’ పేరిట సిరిసిల్లలో మహాధర్నా నిర్వహించారు. వందలాది మంది నేత కార్మికులు ర్యాలీ తీశా రు. నిరుడు ఇచ్చిన బతుకమ్మ చీరలకు సంబంధించి రూ.482 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇ చ్చి చేతినిండా పనికల్పించాలని నేతన్నలు డి మాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మె ల్సీ, సీఐటీయూ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సం క్షోభంలోకి కూరుకుపోయిందని విమర్శించా రు.
ఉపాధి లేక మరమగ్గాల కార్మికులు, ఆసాములు, వైపనీ కార్మికులు, జాఫర్లు, గుమస్తాలు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రూ.కోట్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి, కార్మికులకు చేతినిండా పనికల్పించిందని అన్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టెస్కోకు రూ.480 కోట్లు చెల్లించకపోవడమే కాకుండా జనవరిలో ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలు, ప్రభుత్వరంగ సంస్థల ఆర్డర్లు ఇవ్వక పోవడంతో యా జమాన్యం పరిశ్రమను మూసి వేసిందని అన్నా రు. దీంతో ఉపాధి లేక కార్మికులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సిరిసిల్లలో పవర్లూం కార్మికులు ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా పార్లమెంటులో ప్రస్తావించారా? అంటూ ఎంపీ బండి సంజయ్ని నిలదీశారు.