త్రిపురారం/హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా త్రిపురారంలోని పంట చేనులో గురువారం ఉదయం స్థానిక రైతు కోడి పెద్దులు వరి చేను లో మొసలి కనిపించింది. మిర్యాలగూడ రేంజ్ ఆఫీసర్ ఆనంద్రెడ్డి తన బృందంతో అక్కడికి చేరుకొని మొసలిని తాళ్లతో బంధించి తీసుకెళ్లి నాగార్జునసాగర్ జలాశయంలో వదిలిపెట్టారు.
చెరువులో మొసలి ఉందని ఏడాది కాలంగా చెప్తున్నా ఎవరూ పట్టించుకోలేదని, ప్రస్తుతం చెరువు ఎండిపోవడంతో పంట పొలాల్లోకి చేరిందని రైతులు తెలిపారు.