Vikarabad | వికారాబాద్ : బట్టలు ఆరేస్తుండగా విద్యుత్షాక్తో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలంలోని బురాన్పూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బురాన్పూర్కు చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్(48), లక్ష్మి(42) వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు వద్ద బట్టలు ఆరేసేందుకు తీగలు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం ఉదయం బట్టలు ఆరేసే క్రమంలో వారు కట్టిన తీగకు విద్యుత్ ప్రసరించింది. దీంతో విద్యుత్ షాక్కు గురై దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కాలనీకి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఆ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుల నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.