బాన్సువాడ, సెప్టెంబర్ 28: బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని పొతంగల్ మండలం కల్లూర్ గ్రామానికి చెందిన 80 మంది కుర్మ కుటుంబాల వారు గురువారం ఏకగీవ్ర తీర్మానం చేశారు.
ఈ మేరకు బాన్సువాడలో సభాపతిని కలిసి ఏకగ్రీవ తీర్మాన కాపీని అందజేశారు. తమకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరుచేసి సొంతింటి కలను నెరవేర్చిన స్పీకర్ పోచారం వెంటే ఉంటామన్నారు.