నారాయణపేట : కొద్ది రోజులుగా జిల్లా ప్రజలను కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుత(cheetah)ను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాకొండ గ్రామంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. నారాయణపేట( Narayanapet )జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామంలో కొన్ని రోజులుగా చిరుత గ్రామ సమీపంలో ఉన్న గట్టుపై చిరుత సంచరిస్తూ 10 పైగా పశువులను, లేగ దూడలపై దాడి చేసి చంపిందని రైతులు తెలిపారు. గడప దాటి పొలాల దగ్గరకు వెళ్లడానికి రైతులు భయాందోళనలకు గురయ్యారు. చిరుత ఎట్టకేలకు చిక్కడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.