సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షల కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని మునిపల్లి మండలం చిన్నచల్మెడ గ్రామంలో శుక్రవారం జరిగిన ఘటన కలకాలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న చెల్లెలు గ్రామానికి చెందిన ఆనంద్(28) అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు పాత కక్షలతో దారుణంగా హత్య చేసి గ్రామంలో ఓ ఇంటి ముందు పడేశారు.
ఉదయం ఇంటి ముందున్న శవం చూసిన ఇంటి సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని బుదేరా పోలీసు స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కాగా హత్యకు గురైన యువకుడిపై ఇదివరకే కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.