జగిత్యాల : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పి కలిగి మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జడ్పీ చైర్మన్ దావా వసంతతో కలిసి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రైతు వ్యతిరేక చట్టాలకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలతో రైతులను కూలీలుగా మార్చిందన్నారు. నిత్యావసర సరుకుల చట్టాన్ని రద్దు చేయడంతో బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేసే వారికి వరంగా మారిందన్నారు.
కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రైతులకు చేసింది శూన్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేస్తున్న ఎన్నో అభివృద్ధి పథకాలలో ఒక్క పైసా అయిన కేంద్ర ప్రభుత్వానిది ఉందా అని ప్రశ్నించారు. రైతు చట్టాలపై ఎంపీ అరవింద్, బండి సంజాయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పంజాబ్లో వరి ధాన్యాన్ని ఎలా కొంటారో అలాగే తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనాలన్నారు. ఏడేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం నూనె ఉత్పత్తుల ని పెంచడానికి తీసుకున్న చర్యలేంటో చెప్పాలన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లు రైతుల విషయంలో చేస్తున్న మోసాలను రైతులు గుర్తించాలన్నారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దామోదర్, పీఏసీఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, అర్బన్ జెడ్పీటీసీ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి