శాసన మండలి చైర్మన్ గుత్తా
విప్ గొంగిడి సునీత ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం
ఆలేరు రూరల్, మార్చి 30 : తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన జోనల్ వ్యవస్థతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే రానున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
స్థానికులకే ఉద్యోగాలు రావాలని సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా కొనసాగనున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ సంకల్పమైన నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరబోతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్ పాల్గొన్నారు.