హైదరాబాద్: నగర శివార్లలోని పెద్దఅంబర్పేట వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ కారు.. పెద్దఅంబర్పేట వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు పాదచారులతోపాటు కారులో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
కారులో ప్రయాణిస్తున్న వారిని బీఎన్ రెడ్డి నగర్కు చెందిన వీరనారాయణ కుటుంబ సభ్యులగా పోలీసులు గుర్తించారు. ఒంగోలులో తమ బంధువుల చావుకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంని తెలిపారు. ఈఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు.