హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగు నీటి గుండెకాయ… ఒక్కో రాయి పోగేసి కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం తన పరిధిలోకి తీసుకోనున్నది. ఆ ఒక్కటే కాదు తెలంగాణ ప్రాంతంలోని 79 ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్, చెరువులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇరు రాష్ర్టాల్లోని 107 ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల పరిధిలోకి తీసుకురానున్నది. కేఆర్ఎంబీ పరిధిలో 36 ప్రాజెక్టులు, జీఆర్ఎంబీ పరిధిలో 71 ప్రాజెక్టులున్నాయి. వీటిలో 79 జలవనరులు తెలంగాణ ప్రాంతానికి చెందినవే. ఏపీలోని కేవలం 15 ప్రాజెక్టులు మాత్రమే బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. మరో 13 ఉమ్మడి ప్రాజెక్టులు కూడా బోర్డులకు అప్పగించనున్నది. దీంతో తెలంగాణలో సాగునీటి వ్యవస్థ మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్లిపోనున్నది.
కేఆర్ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులు
క్ర.సం ప్రాజెక్టు పేరు రాష్ట్ర పరిధి