KGBV | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 38 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వీటిల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా 7.60 కోట్ల భారం పడుతుందని తెలిపారు. విద్యాలయాల అప్గ్రేడ్తో 3,040 బాలికలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.