నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ఎగువ నుంచి సాగర్లోకి 63,221 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాయశయం నుంచి మొత్తగా 82,442 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. సాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 590 అడుగులు. ప్రస్తుతం 589 అడుగుల వద్ద నీరు ఉన్నది.
కాగా, శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టుకు 1,39,975 క్యూసెక్కులు వస్తుండగా, 1,18,997 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 213 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.