హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని 6.06 లక్షల మంది భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకొన్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 2 నుంచి 11 వరకు ఉత్తర ద్వార దర్శనం కల్పించామని పేర్కొన్నారు.
పది రోజులకు శ్రీవారి హుండీకి రూ.39.40 కోట్లు రాగా, లడ్డూ విక్రయాల ద్వారా రూ.34.60 లక్షలు ఆదాయం లభించినట్టు వివరించారు. ఈ నెల 28న రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో తెలిపారు.