మహబూబ్నగర్/నల్లగొండ: కృష్ణా నది (Krishna river) పరీవాహంలో కురుస్తున్న వర్షాలతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 35 వేల క్యూసుక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 54,621 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి (Srisailam) విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు. ప్రస్తుతం 317.030 అడుగుల వద్ద ఉన్నది. ఇక ప్రాజెక్టులో మొత్తం 9.657 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇప్పుడు 6.786 టీఎంసీ నీరు నిల్వ ఉన్నది.
కాగా, నల్లగొండ (Nalgonda) జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు (Moosi Project) వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు
9 గేట్లు నాలుగు అడుగుల మేర పైకిఎత్తి 55,474 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. భారీగా నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 38,852 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతున్నది. కాగా, మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుతం 642 అడుగుల వద్ద నీరు ఉన్నది. గరిష్ఠ నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా
ఇప్పుడు 3.64 టీఎంసీలు ఉన్నాయి.