భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలో రూ. కోటి విలువ చేసే 524.4 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రాజస్థాన్కు చెందిన ఇద్దరు డ్రైవర్ల నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గంజాయిని లారీలో తరలిస్తుండగా పట్టుకున్నామని, ఇద్దరు డ్రైవర్ల నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తులను నారాయణ తేలి, బైరూలాల్ గుర్జార్గా గుర్తించారు. ఈ ఇద్దరితో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడిన పురం గుర్జార్, రయీస్ ఖాన్(ఒడిశా వాసులు) పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఒడిశాలోని చిత్రకొండ నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కు గంజాయిని తరలిస్తున్నట్లు డ్రైవర్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.