విద్య, వైద్యం, భద్రతకు ప్రాధాన్యం
హైదరాబాద్, మార్చి 9 : అత్యంత కీలకమైన విద్య, వైద్యం, భద్రతా రంగాల్లో ఏకంగా 52 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రధాన శాఖల బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఇం దులో భాగంగానే ఆయా శాఖల్లో అత్యధిక పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా విద్యాశాఖలో ఏకంగా 20,964 పోస్టులను భర్తీ చేయనుండటం గమనార్హం. ఆ తర్వాత పోలీస్శాఖలో 18,334 పోస్టులు, వైద్యశాఖలో 12,755 పోస్టులను భర్తీ చేయనున్నది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకొటున్నది. ఇందులో భాగంగానే జిల్లా దవాఖానలను మెరుగుపరిచింది. జీహెచ్ఎంసీలో 4 మల్టీ స్పెషాలిటీ దవాఖానలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభు త్వం చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటికే గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య ను అందిస్తున్నది. తాజాగా ‘మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ స్కూళ్ల దశ, దిశను మారుస్తున్నది. ఈ నేపథ్యంలో పాఠశాల, ఉన్నత విద్యలో మొత్తం 20,964 పోస్టులను భర్తీ చేయనున్నది. ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది.