న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్లోని ఫైజాబాద్లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంప కేంద్రం ఫైజాబాద్కు దక్షిణాన 72 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
భూకంపం ప్రభావంతో జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) శ్రీనగర్ (Srinagar), పూంచ్ (Poonch), ఢిల్లీ (Delhi), చండీగఢ్ (Chandigarh)తోపాటు పంజాబ్ (Punjab), హర్యానా (Haryana) లోని చాలాప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కదిలిందని అధికారులు వెల్లడించారు. అయితే దీనివెల్ల ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పారు.
An earthquake of magnitude 5.9 occurred 70 km southeast of Fayzabad, Afghanistan, at around 10.19 am: EMSC
Tremors were also felt in Srinagar and Poonch in J&K.
— ANI (@ANI) May 28, 2023